కరోనా ఇంతగా వ్యాపిస్తుంటే ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదీ తమకు చెప్పాలంది. లేదంటే తామే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో తెలంగాణలోని పరిస్థితులపైనా హైకోర్టు విచారణ చేసింది. పదిరోజుల క్రితం ఆదేశాలిస్తే ఇప్పటివరకు అమలెందుకు లేదని ప్రశ్నించింది. అయితే రాష్ట్రంలో పాఠశాలలు, మూసివేశామని, మత ర్యాలీలు నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. పెళ్లిళ్లు, చావులు,పార్టీలు, ఎన్నికలర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇష్టానుసారంగా రాజకీయసభలు సమావేశాలు నిర్వహిస్తుండడంపై కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల నివేదిక సమగ్రంగా లేదంటూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.