ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్టవిరుద్ధమని, పార్టీ మారితే ఇస్తామని వందకోట్లు ఆఫర్ చేశారు తప్ప…డబ్బు ఎక్కడా దొరకలేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. మంగళవారం ఈడీ విచారణకు రోహిత్ హాజరుకావల్సి ఉండగా వెళ్లలేదు దీంతో ఈనెల 30 విచారణకు హాజరుకావాలని ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది.