తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన మీద సీరియస్ అయింది. వారంలో రెండు సార్లు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడితే అధికారులు నిద్రపోతున్నారా?? అని స్పష్టంగా సూటిగా ప్రశ్నలు కురిపించింది.
రెండు రోజుల క్రితం వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనతో శైలజ అనే అమ్మాయి మరణించిన సంఘటన అందరికీ కంటతడి పెట్టించింది. ఈ క్రమంలో రెండు సార్లు మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గురుకుల స్కూల్స్, జెడ్పి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చెడిపోతుండడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
“పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ” అని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే మండిపడ్డారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvw pic.twitter.com/6AQJh9frD5
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
వారం క్రితం ఇదే హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 30 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. అదే మాదిరిగా తెలంగాణలో మరికొన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల మీద ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియజెప్పాలి అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.