ఉగ్రవాది రాణా భారత్ కు తరలింపు
…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్క్ దౌత్యం మరోసారి ఫలించింది. ముంబైలో విధ్వంసానికి పాల్పడ్డ క్రిమినల్ మాస్టర్.. తహవ్వూర్ రాణా ను భారత్ కు తీసుకొని వచ్చారు. ముంబై లో పేలుళ్ల సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సదానంద్ డేట్ ను ఎన్ ఐ ఎ చీఫ్ గా నియమించినప్పటినుంచీ వేట ఊపందుకొంది. పరమ కిరాతకంగా 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకొన్న ముంబై పేలుళ్లు చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అంతటి దారుణానికి పాల్పడ్డది చోటా ఉగ్రవాదులు అయితే, దీనికి కుట్ర చేసి అమలు చేసిన మాస్టర్ మైండ్స్ మాత్రం తహవ్వూర్ రాణా, డేవిడ్ హెడ్లీ. భారత్ అధికారుల కృషితో రాణాను తీసుకొని వచ్చారు, త్వరలోనే డేవిడ్ హెడ్లీ ని కూడా తెచ్చేసే అవకాశం ఉంది.
……
ముంబై లో ఉగ్రవాద దాడులకు పథక రచన చేసిన డేవిడ్ హెడ్లీ , తహవ్వూర్ రాణా బాల్య మిత్రులు. చిన్నప్పుడు పాకిస్థాన్ లో చదువుకోవటంతో అప్పట్లోనే ఉగ్రవాద భావాలను వంట బట్టించుకొన్నారు. తర్వాత కాలంలో పాశ్యాత్య దేశాలకు వెళ్లిపోయినప్పటికీ, పాక్ ఉగ్రవాద భావాలు వీడిపోలేదు. దీంతో పాకిస్తాన్ సంతోషం కోసం ఐ ఎస్ ఐ తో చేతులు కలిపారు. పాక్ ఉగ్రవాద తండాల ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో విధ్వంసం కోసం పథక రచన చేశారు.
…
2008 సంవత్సరం లో భయంకరమైన విధ్వంసం కోసం తహవ్వూర్ రాణా ముంబైలోనే మకాం వేసి అమలు చేశారు. ఉగ్రవాదులతో కలిసి 8 సార్లు రెక్కీ నిర్వహించారు. ముంబై మీద విరుచుకు పడి వందల మంది అమాయకులను చంపేయాలన్న కుట్రను రాణా అమలు చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు హిందువుల పేర్లు తగిలించుకొని ప్లాన్ అమలు చేశారు. పాకిస్థాన్ కళ్లలో సంతోషం కోసం వందల మందిని చంపేసేందుకు తెగబడ్డారు.
…
ఆ సమయంలో ముంబై లో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న సదానంద్ డేట్… ప్రాణాలకు తెగించి పోరాడారు. హోటల్ బిల్డింగ్ లు ఎక్కుతూ ఉగ్రవాదుల్ని కట్టడి చేసేందుకు శ్రమించారు. గ్రెనేడ్లు మీద పడుతున్నప్పటికీ, వెనుకంజ వేయకుండా పోరాడారు. ఆయన సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం .. రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది.
….
ఇంతటి భారీ కుట్ర చేసిన హెడ్లీ, రాణా అమెరికాలో పోలీసులకు దొరికిపోయారు. కానీ దేశాల మధ్య ఒప్పందాల ఆదారంగా ఇప్పటిదాకా నాటకాలు ఆడుతూ వచ్చారు. కానీ భారత్ లోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అధికారంలోకి వచ్చిన 4,5 ఏళ్లకే బూచాళ్లను తెచ్చేయాలని ప్రయత్నించారు. ఈలోగా అక్కడ ప్రభుత్వం మారటంతో మ్యాటర్ పెండింగ్ లో పడింది. అక్కడ తిరిగి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డాక భారత్ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా ఎన్ ఐ ఎ చీఫ్ సదానంద్ డేట్ పట్టుదలగా శ్రమించటంతో రాణా పాపం పండింది. చివరకు ఈ బూచాడిని భారత్ కు తెచ్చేశారు.
…
ఈ మొత్తం ఎపిసోడ్ లో హీరో సదానంద్ డేట్ అయితే, విలన్ గా తహవ్వూర్ రాణా నిలుస్తున్నారు. విలన్ ను భారత్ లో ఉరికంబం ఎక్కించటంతో క్లైమాక్స్ ముగుస్తుంది. మరి, ఈ ఎపిసోడ్ కు స్క్రీన్ ప్లే, దర్శకత్వం నరేంద్రమోదీ అనటంలో సందేహం ఏముంది.