ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొదటగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆదిమూలపు సురేష్(యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి), అంజద్ బాషా(కడప), బూడి ముత్యాల నాయుడు(మూడుగుల), బుగ్గన రాజేద్రనాథ్ రెడ్డి(డోన్), దాడి శెట్టి రాజా(తుని), చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ(రామచంద్రాపురం), ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), గుడివాడ అమర్ నాత్( అనకాపల్లి) జోగి రమేష్(పెడన), కారుమూరి నాగేశ్వర రావు(తణుకు), గుమ్మనూరు జయరాం(ఆలూర్), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి( పుంగనూరు), కాకాణి గోవర్ధన్ రెడ్డి(సర్వేపల్లి), నారాయణ స్వామి(గంగాధర నెల్లూరు), ఉష శ్రీచరణ్(కళ్యాణదుర్గం), మేరుగు నాగార్జున(వేమూరు), విశ్వరూప్(అమలాపురం), పీడిక రాజన్నదొర(సాలూరు), ఆర్కే రోజా(నగరి), విడదల రజని(చిలకలూరిపేట), సీదిరి అప్పలరాజు(పలాస) సహా తానేటి వనిత(కొవ్వూరు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రులు సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి గైర్హాజరయ్యారు. మాజీ హోంమంత్రి సుచరిత ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. మరోవైపు తనకు మంత్రి పదవి నిరాకరించడంపై అధిష్టానంపై మాజీ మంత్రి బాలినేని మండిపడుతున్నారు.. నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)