టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ , లోక్సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్గా మార్చాలని అధికారులను ఆదేశించారు. లోక్సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు చెప్పారు. ఛైర్మన్ కు, స్పీకర్ కు లేఖ ఇచ్చామని… రేపటి నుంచి పార్లమెంట్లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామని పార్టీ సీనియర్ నెత కేశవరావు అన్నారు.