విదేశీ వ్యాపార/వాణిజ్య చెల్లింపులను డాలర్ ద్వారా కాకుండా నేరుగా రూపాయిలలో చెల్లింపులు చేయడానికి వీలుగా అని ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను తెరవడానికి 18 దేశాలకు చెందిన దేశీయ/విదేశీయ బ్యాంకులకు RBI తుది ఆమోదం తెలిపింది.
ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రభావం తగ్గించడానికి, డాలర్ రేట్ ఒడిదుడుకులు వల్ల భారత్ ఎగుమతులు లేదా దిగుమతులు విలువ ప్రభావితం కాకుండా తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగం.
ఇన్నాళ్లు ప్రపంచ వాణిజ్య వ్యవహారాలు లో డాలర్ దే పై చేయగా ఉంటోంది. అయితే రష్యా, చైనా, భారత్ డాలర్ ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు మొదలు పెట్టాయి.
ఈ డిడాలరైజేషన్ చర్యలు బహుశా అమెరికాకు ఆగ్రహం తెప్పించవచ్చు. రాబోయే రోజుల్లో అంటే 2024 ఎన్నికలు వరకు మోడీ ప్రభుత్వం పై మరిన్ని హిట్ జాబ్స్, దాడులు, మరిన్ని వీధి పోరాటాలు మనం చూడవచ్చు.
బహుశా ఈ చర్యల్లో భాగంగానే ఎరిక్ గెర్సెట్టి అనే వివాస్పద వ్యక్తిని భారత్ కి కొత్త అంబాసిడర్ గా అమెరికా నియమించింది. ఈయన ఇంకా భారత్ లో కాలు పెట్టకుండానే “భారత్ లో మానవ హక్కులు మరియు CAA, NRC విషయాలపై పోరాడితున్న వ్యక్తులకు, సంస్థలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అని ప్రకటించాడు.
దీనిని బట్టి రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనం కాస్త ఊహించవచ్చు.
ఈ క్రింద 18 దేశాలు లో భారతీయ బ్యాంకులు ప్రత్యేక వాస్ట్రో రూపాయి ఖాతాలను తెరవడానికి అనుమతి ఇచ్చింది.
- బోట్స్వానా
- ఫిజీ
- జర్మనీ
- గయానా
- ఇజ్రాయెల్
- కెన్యా
- మలేషియా
- మారిషస్
- మయన్మార్
- న్యూజిలాండ్
- ఒమన్
- రష్యా
- సీషెల్స్
- సింగపూర్
- శ్రీలంక
- టాంజానియా
- ఉగాండా
- యునైటెడ్ కింగ్డమ్
…చాడా శాస్త్రి….