ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమ తెలిపారు. అసలైతే కోవిడ్ టైంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ లైన్ క్లాసులు మొదలయ్యాక కూడా దాన్నే కొనసాగించారు. తాజాగా మరోసారి మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు ప్రిన్సిపల్. అటు కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు మద్దతిచ్చారు. గతేడాది జేన్యూలో జరిగిన ఘటన నేపథ్యంలో అలాంటివి తమ కాలేజీలో పునరావృతం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు. శ్రీరామనవమి రోజున కాలేజీ క్యాంటీన్లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాంసాహారం తింటుండగా ఏబీవీపీలు విద్యార్థులు అడ్డుకోవడంతో గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1614437491205099521?s=20&t=cySuLvMnNsmkeUa_BWgHBg