గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ-ఎస్ సీఆర్ ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్టు రిపోర్టుల ప్రాజెక్ట్ గురువారం నుంచి మొదలవుతుంది. ప్రస్తుతానికి కొన్ని షెడ్యూల్డ్ భాషల్లో తీర్పుల అనువాద ప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ తెలిపారు. న్యాయవాదులు, న్యాయవాదులు, ప్రజలు వాటిని ఉచితంగానే వినియోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి సుప్రీం కోర్టు తీర్పులను అనువదించే కృషిని కొనసాగుస్తున్నట్టు తెలిపారు. ఈ ఎస్సీఆర్ ప్రాజెక్టులో భాగంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఇప్పుడు 34 వేల తీర్పులున్నాయని ఆయన చెప్పారు. అనువాద ప్రక్రియ ఇకముందు కూడా సాగుతుందన్నారు.