తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్లోని కంటాలా,పొచ్చెర సహా జలపాతాలు నయాగరా ఫాల్స్ ను తలపిస్తున్నాయి.. నిండుకుండల్ని తలపిస్తున్న ప్రాజెక్టులను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం తరలివస్తున్నారు..
ఇక భారీవర్షాలకు నిర్మల్, బోధ్ సహా పరిసర గ్రామాలు జలమయమయ్యాయి..వరదనీరు ఇళ్లల్లోకి చేరడంతో జనం ఇబ్బందిపడుతున్నారు..
లోతట్టుప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ..
భారత వాతావరణ శాఖ తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వచ్చే మూడు రోజుల్లో ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..