ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శోకసముద్రంలో మునిగిపోయింది. రాజధాని ప్రాంతం నెలకొని ఉన్న విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని జల ధిగ్బంధనంలో చిక్కుకొని పోయాయి. రోజులు తరబడి వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నగరం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతోంది.
ఈ ఆపద సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు ముందుకు కదిలారు. సేవా భారతి కార్యకర్తలు సేవా కార్యక్రమాలకు నడుము బిగించారు అజిత్ సింగ్ చిట్టినగర్ కబాల సెంటర్ తదితల ప్రాంతాల్లో 200 మందికి పైగా కార్యకర్తలు .. నాలుగు రోజులుగా పగలు రాత్రి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడ వారికి కనీస అవసరాలు అయినా తాగునీరు ఆహారం మందులు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం సత్యనారాయణపురం లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం మరియు విద్యా భారతి కార్యాలయం వేదికగా పనులను విభజించుకుని చేసుకుంటున్నారు. శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలకు చెందిన కొన్ని గదులను పూర్తిగా వరద బాధితుల తాత్కాలిక ఆశ్రయం కోసం కేటాయించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులకు మూడు పూటలా ఆహారము సురక్షిత తాగునీరు అందిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సేవా భారతి కార్యకర్తలు నగరానికి చేరుకుని నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. తక్షణ అవసరాల కోసం బిస్కెట్లు అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలు విరివిగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వివిధ క్షేత్రాల ప్రతినిధులు ముమ్మరంగా సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు..
ఈ మూడు రోజులలో
వరద భాదితులకు 25 వేల భోజన ప్యాకెట్లు, 40 వేల వాటర్ బాటిల్స్ 5వేల పాల ప్యాకెట్లు, కొవ్వొత్తులు, బిస్కెట్లు మరియు రొట్టెలను అందించారు. ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న సింగ్ నగర్లో 5000 ప్యాకెట్లు మరియు 3500 వాటర్ బాటిల్స్ అయోధ్య నగర్ లో 3000 భోజన ప్యాకెట్లు 2500 వాటర్ బాటిల్స్ మహానాడు కట్టనందు 800 భోజన ప్యాకెట్లు, వన్ టౌన్ ఏరియా 2200 భోజనం ప్యాకెట్లు మరియు 1700వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లను సేవా భారతి స్వయం సేవకులు పంపిణీ చేశారు.
మొదటినుంచి నిశ్శబ్దంగా సేవా కార్యక్రమాలు చేయడం సేవా భారతికి అలవాటు. అదే తరహాను విజయవాడ వరదల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా సేవా భారతి కార్యకర్తలు సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.