రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్రప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు పలువురు అధికారులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది.