శివసేన పార్టీ గుర్తు విషయంలో దాఖలైన పిటిషన్ ను గురువారం విచారించనుంది సుప్రీంకోర్టు. అప్పటివరకు ఠాక్రే-షిండే శిబిరాల మధ్య పార్టీ గుర్తువివాదంపై గురువారం వరకు చర్య తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికీ సూచించింది.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో ఉద్దవ్ ఠాక్రే సర్కారు కూలిపోయిన సంగతి తెలిసిందే. తరువాత బీజేపీ మద్దతులో షిండే సీఎంగా బాధ్యతలు చెపట్టారు. అప్పటినుంచి అసలైన పార్టీ తమదంటే తమదంటూ ఇరువర్గాలూ పట్టుబడుతున్నాయి. అందులో భాగంగా సుప్రీంను ఆశ్రయించాయి. కోర్టు నిర్ణయంకోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.