
Supreme Court of India
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఈనెల పదోతేదీలోగా… ఇరుపక్షాలు లిఖితపూర్వక సమాధానాలు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సీల్డ్ కవర్లో దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకును సుప్రీం ఆదేశించింది. 2016 నవంబరు 8న పెద్దనోట్లను ప్రధానీ మోదీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని వ్యతిరేకిస్తూ నాటినుంచి అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అన్నింటి విచారణను నేటితో ముగించింది ధర్మాసనం.