సుప్రీంకోర్టు చరిత్రలోనే నూతన ఒరవడికి ఇవాళ శ్రీకారం చుట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం నేడు మొదలైంది. ఇవాళ యూట్యూబ్లో ప్రసారం కాగా…త్వరలోనే సొంత చానల్ వేదిగ్గా కేసుల విచారణ ప్రత్యక్షప్రసారంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యక్షప్రసారమైన మొట్టమొదటి కేసు మహారాష్ట్రలో శివసేన కేసు. అసలైన శివసేన మాదంటే మాదంటూ అటు షిండే వర్గం, ఇటు ఠాక్రే వర్గం పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆపిటిషన్లను ధర్మాసనం నేడు విచారణకు చేపట్టింది. అయితే ప్రస్తుతానికి రాజ్యాంగధర్మాసనం కేసులను మాత్రమే ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు. తరువాత ఇతర ధర్మాసనాలు చేపట్టే కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.