విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధమని వాదన వినిపించారు. 22 వేల ఎకరాల తీసుకుని 9,200 మంది రైతులకు నేటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
22 వేల ఎకరాలు తీసుకొని 9,200 మంది రైతులకు నేటి వరకూ ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా తాము అనేక మార్గాలు కూడా ప్రతిపాదించామని తెలిపారు. నేటి వరకూ కౌంటర్లు వేయని కేంద్రం, ఆర్ఐఎన్ఎల్, రాష్ట్ర ప్రభుత్వం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తుది విచారణను హైకోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.