బీఎల్ సంతోష్ , తుషార్ లకు 41 నోటీస్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజుతో స్టే గడువు ముగియడంతో స్టే పొడిగించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయముర్తి రెండు వారాల గడువు ఇస్తానన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పెండింగ్లో ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. విచారణ పూర్తి కావడానికి సమయం పడుతుండటంతో 6 వారాల వరకు హై కోర్టు స్టే ఇస్తూ.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.