మోడీ ప్రభుత్వం హెల్త్ ఇన్ఫ్రా మీద ఖర్చు చెయ్యలేదు అందుకే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ గత ఆరేళ్లలో వైద్యం, ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం తీసుకున్న సంస్థాపరమైన శాశ్వత చర్యలు ఎన్నో.
మెడికల్ సీట్లు:
2014 – 52000
2020 – 88250
(70% పెరుగుదల)
ఎయిమ్స్:
2014 – 7
2020 – 22
(67 ఏళ్లలో 6 AIIMS అయితే ఈ ఏళ్లలో 7 ఏళ్లలో 15 ఎయిమ్స్ను మోడీ జోడించారు ఈ 15లో మూడింటిలో ఇంకా పనులు ప్రారంభం కావాలి)
వైద్య కళాశాలలు :
2014 – 385 (209 ప్రైవేట్ + 176 ప్రభుత్వం)
2020 – 532 (260 ప్రైవేట్ + 272 ప్రభుత్వం)
(మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ప్రైవేట్ వాటి సంఖ్య కంటే ఎక్కువ)
గత సం.కరోనా వచ్చే సరికి మాస్క్ లు గానీ, సానిటైజర్లు గానీ, హాండ్ గ్లోవ్స్ కానీ డాక్టర్లు, హెల్త్ వర్కర్స్ ధరించడానికి PPE కిట్స్ గానీ, అలాగే సీరియస్ కేసుల్లో ఉపయోగించడానికి వెంటిలేటర్లు కానీ పెద్ద మొత్తంలో లేవు. PPE కిట్స్ వెంటిలేటర్లు అయితే దిగుమతి చేసుకునే వారం.
కానీ ఈ ఒక్క సం.లో PPE కిట్స్ దేశంలో ఉత్పత్తి ప్రారంభించి ప్రపంచంలో రెండో స్థానానికి చేరాం.
15 లక్షలు వరకు ఖర్చు చేసి దిగుమతి చేసుకునే వెంటిలేటర్లను 2లక్షల లోపే ఖర్చుతో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో దేశం మొత్తం మీద 50 వేల వెంటిలేటర్లు ఉంటే ఈ ఒక్క సం.లో సుమారు 36000 వెంటిలేటర్లు దేశంలోనే తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు PM CARES ఫండ్ ద్వారా అందచేశారు.
అలాగే ఒక్క సం.కాలంలోనే కోవిడ్ వాక్సిన్ కూడా మన దేశంలోనే తయారుచేసుకో గలుగుతున్నాం.
మెరిట్ ఉండి, కష్టపడి చదివే ఓపిక ఉండి సాధారణ ఫీజ్ కట్టి చదువుకుని డాక్టర్ అవుతాం అంటే అవకాశం కల్పించలేని దౌర్భాగ్య వైద్యవిద్యా వ్యవస్థ తయారుచేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?
డబ్బులు ఉంటే ఆసుపత్రి వెంటనే కట్టవచ్చు. కానీ ఒక సాధారణ డాక్టర్ తయారు కావడానికి 6సం.లు, స్పెషలిస్ట్ కి సుమారు 10సం.లు పడుతుంది. హెల్త్ ఇన్ఫ్రా లో దేశం ఇంత బలహీనంగా ఉంది అని ఇప్పుడు సడన్ గా ఏడిస్తే ఎలా?
గతంలో ఈ రంగం మీద కావలసినంత శ్రద్ధ పెట్టని కారణంగా ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టినా వాటిల్లో పాఠాలు చెప్పేందుకు తగిన సంఖ్యలో ప్రొఫెసర్లు లేరు.
అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సంఖ్యను ఏకకాలంలో పెంచకుండా, దేశ వైద్య విద్యావ్యవస్థను విస్తరించకుండా , ఆధునీకరించకుండా పూర్తి స్థాయి మార్పులు కావాలని ఇప్పుడు ఎంత ఏడిస్తే ఏం లాభం.
‘అవినీతిని అరికట్టడానికి , పారదర్శకతను పెంచడానికి… వైద్య విద్య పాలనలో జవాబుదారీతనం నాణ్యతను పెంచడానికి ఇది దోహదం చేస్తుంది..ఇదే మైలురాయి అవుతుంది..వైద్య విద్య సీట్ల సంఖ్యను పెంచడంతో పాటు..వైద్యవిద్య ఖర్చును తగ్గిస్తాం. ప్రతిభావంతులైన యువత మెడిసిన్ విద్యవైపు వెళ్లవచ్చు’ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు 2019 చట్టంగా రూపుదాల్చిన సందర్భంగా భారత ప్రధాని అన్నమాటలివి. దేశంలో విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందడంలేదని, వైద్య విద్యలో సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఎన్ఎంసీ చట్టాన్ని తీసుకొచ్చింది గతేడాది.దేశంలో వైద్య విద్యకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద సంస్కరణ ఇది అని చెప్పవచ్చు.