ఇప్పటికే పూర్తిస్థాయిలో చతికిల పడిపోయిన వైసీపీకి మరో తలనొప్పి రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రమంతా మరోసారి నడుచుకొంటూ వెళ్లి అన్నయ్య వైయస్ జగన్ ని ఒక రేంజ్ లో ఆడుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వైసిపి నేతలు ముఖ్యంగా అధ్యక్షుడు వైయస్ జగన్ తల పట్టుకుంటున్నారు.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీలో అధికార తెలుగుదేశం పార్టీ జోలికి పెద్దగా వెళ్లడం లేదు. ఇప్పటికే వైసీపీ మీదే తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పిస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. కాబట్టి ఈ పాదయాత్రలో షర్మిళ .. వైసీపీ మీద జగన్ మీదే విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించరు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి వైయస్ షర్మిళ .. పాదయాత్రల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెప్తున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.
మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట.
దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వెంటనే పాదయాత్రకు వెళ్లిపోతారు అని చెబుతున్నారు.
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది పాదయాత్రకి వెళ్ళినట్లయితే.. కొత్త ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం మీద విమర్శలు చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. పూర్తిస్థాయిలో వైసీపీని తిట్టుకుంటూ పాదయాత్ర చేసి వచ్చేయచ్చు. పబ్లిక్ పల్స్ కూడా ఇందుకు అనుకూలంగా ఉంది కాబట్టి పాదయాత్రకు స్పందన బాగుంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.