https://twitter.com/ANI/status/1370616432652783620
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. రాజకీయ నేతలతో పాటు.. ప్రముఖులు కూడా 60 ఏళ్లు దాటిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా కరోనా తొలి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కరోనా వ్యాక్సిన్ను నొప్పిలేకుండా తీసుకున్నానని.. ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆశిస్తున్నానంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి అంతా సురక్షితంగా ఉంటారన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.82 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.