తన కుమారుడిని విడిపించుకునేందుకు స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడో పోలీసు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. బిహార్లో ఈ ఘటన జరిగింది. సహస్ర జిల్లాకు చెందిన శశిభూషణ్ సిన్హా నౌహట్ట పీఎస్ పరిధి దర్హార్ ఔట్ పోస్టులో పనిచేస్తున్నారు. ఓ మహిళ తన కుమారుడిని విడిపించుకునేందుకు స్టేషన్ కు వచ్చింది. అయితే తనకు మసాజ్ చేస్తే విడిపిస్తాడనని అనడంతో ఆమె అందుకు ఒప్పుకుంది. మసాజ్ చేయించుకుంటూ కేసు గురించి లాయర్ తో మాట్లాడాడు.
In an atrocious incident, a woman was forced to give body massage to an officer in-charge of a police post in the Saharsa district in Bihar to get her son out of jail. #Bihar #BiharPolice #ViralVideo #bodymassage #Video #News #TheFirstIndia pic.twitter.com/hu4y36QW5o
— First India (@thefirstindia) April 29, 2022
‘‘ఆమె పేదమహిళ, ఎంత డబ్బు కావాలి మీకు.. ? ఓ ఎన్వలప్లో ఆ సొమ్ము పెట్టి పంపిస్తాం. నీ దగ్గరికి ఇద్దరు మహిళలు వారి ఆధార్కార్డులు తీసుకుని వస్తారు. అడ్రసు, ఫోన్ నంబరు తీసుకో. రిక్వేస్ట్ చేస్తున్నా పప్పూనేను ఇప్పటికే రూ. 10 వేలు ఖర్చు చేశా’’ అని సిన్హా ఓ లాయర్తో మాట్లాడడం ఆ వీడియోలో చూడవచ్చు. అది గుర్తుతెలియని వ్యక్తెవరో రికార్డ్ చేసి బయటపెట్టారు. సోషల్మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఉన్నతాధికారుల దృష్టికీ విషయం వెళ్లడంతో అతనిపై వేటు వేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)