న్యూఢిల్లీ: ప్రపంచ కప్ షూటింగ్లో భారత షూటర్లు దూసుకెళ్తున్నారు. ఆదివారం రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకాలతో అదరగొట్టారు. మహిళల స్కీట్లో గనెమత్ సెఖాన్ సీనియర్ స్థాయిలో తొలిసారి ప్రపంచ కప్ పతకం అందుకుంది. ఈ విభాగంలో ఆమె కాంస్యం దక్కించుకుంది. ఇక 10 మీ. ఎయిర్ పిస్టల్లో పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలు సాధించాయి. యశస్వినీ సింగ్ దేశ్వాల్, మనూ భాకర్, శ్రీ నివేతతో కూడిన భారత జట్టు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో 16-8 స్కోరుతో పోలెండ్ను చిత్తు చేశారు. అలాగే సౌరభ్ చౌధురి, అభిషేక్ వర్మ, షహజార్ రిజ్వీ త్రయం పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్లో పసిడి పతకం కైవసం చేసుకున్నది. ఫైనల్లో వారు 17-11 స్కోరుతో వియత్నాంను ఓడించారు. కాగా..ఐశ్వర్య ప్రతాప్ సింగ్, దీపక్ కుమార్, పంక్ కుమార్తో కూడిన భారత జట్టు పురుషుల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతంసాధించింది.. అమెరికా జట్టు గోల్డ్్ మెడల్ దక్కించుకుంది. అపూర్వ చండీలా, నిషా కన్వర్, శ్రియాంక షాదంగితో కూడిన భారత మహిళల జట్టు ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచింది.
మళ్లీ అధికారమిస్తే అన్నీ పరిష్కరిస్తాం..
అసోం: మరోసారి అధికారమిస్తే బంగ్లాదేశ్ నుంచి అసోంకి అక్రమ వలసలు చోటు చేసుకోకుండా అడ్డుకుంటామని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అక్రమ వలసలపై రాజకీయం చేయడం తగదన్నారు. ఇవాళ అసోంలోని లుంబ్డింగ్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొరుగుదేశం నుంచి అక్రమ వలసలను అడ్డకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసింది. అస్సామీ సంస్కృతి, గుర్తింపును పరిరక్షిస్తాం. మాకు ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే భూపేన్ హజారికాకి భారత రత్న ఇచ్చేవాళ్లం కాదనీ అన్నారు. బీజేపీ మరోసారి అవకాశం ఇస్తే అన్ని సమస్యలుపరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.
వడ్డీ మాఫీ సాధ్యం కాదు-వడ్డీ మీద వడ్డీ ఉండదు:సుప్రీం కోర్టు
రుణగ్రహీతలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. లోన్ మారటోరియంపై తీర్పు సందర్భంగా… మారటోరియం పొడిగింపు కుదరదని తేల్చి చెప్పింది. వడ్డీ మీద మాఫీ సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే…వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని కోర్టు అంది.. ఇక ఈ తీర్పు నేపధ్యంలో బ్యాంక్ స్టాక్స్ మంగళవారం పరుగుతీశాయి.
లోన్ మారటోరియం కాలంలో వడ్డీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదని అలా చేస్తే… డిపాజిటర్లపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఎకానమిక్ పాలసీపై నిపుణుల సూచనల మేరకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తాయంది సుప్రీం. అయితే రుణ గ్రహీతలకు సుప్రీం కోర్టు కొంత ఊరట కలిగించింది. వడ్డీ మీద వడ్డీ వసూలు చేయరాదని, ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ డబ్బును వెనక్కి చెల్లిస్తారని తెలిపింది. అలాగే లోన్ మారటోరియం పొడిగింపు కూడా ఉండబోదని సుప్రీం స్పష్టం చేసింది.
ఇక సుప్రీం తాజా తీర్పుతో బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 4 శాతం పెరుగుదలతో 75 రూపాయలకు చేరింది. పీఎన్బీ షేరు దాదాపు 3 శాతం పెరుగుదలతో రూ. 39 కి, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి షేర్లు రెండు శాతం మేర పెరిగాయి.