ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం(ఐఎఫ్ఎస్ఓ) యతి నర్సింగానంద్ పేరును కూడా చేర్చారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ ఉద్రిక్తల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఇంకా సోషల్మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించేలా వాళ్ల భాష, తీరు ఉన్నాయనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు.