భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ కు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని దేశ ప్రజలను కోరారు. దీంతో పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలను పోస్టల్ శాఖా విక్రయిస్తోంది. రాష్ట్రంలోని 6214 పోస్టాఫీసుల్లో 7,50,000 నేషనల్ ఫ్లాగ్స్ ను సిద్ధంగా ఉంచింది. ఒక్కో జెండాను 25/- లకు అందిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి పౌరుడు తన సోషల్ మీడియా అకౌంట్లో.. వాట్సాప్ లో.. డిస్ ప్లే పిక్చర్ గా జాతీయ జెండాను ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. దాంతో నెటిజన్లు అందరూ సోషల్ మీడియా అకౌంట్లకు నేషనల్ ఫ్లాగ్ ను అప్లోడ్ చేస్తోన్నారు.