హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరం కాషాయమయమైంది. నగరంలో ఎక్కడచూసినా కాషాయ జెండాలే. ఇక వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి టాడ్ బన్ వరకు హనుమాన్ ర్యాలీ వైభవంగా సాగింది. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ్ మందిర్లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్ వద్ద రాత్రి 8 గంటలకు ముగియగా..ఈ మార్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ సాగింది. మరో ఊరేగింపు కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిసింది.
ఇక మహిళల ప్రత్యేక బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ మహంకాళీ ఆలయం వరకు జరిగిన ర్యాలీలో పెద్దసంఖ్యలో వీహెచ్పీ మహిళలు పాల్గొన్నారు.శ్రీరామోజు రజనీ నేతృత్వంలో దాదాపు 200 బైకులతో పగిడీ, కాషాయ ధ్వజం ధరించి మహిళలు ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించారు. యాత్ర సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.