దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తుంటే అంతర్జాతీయ వేదికపై భారత్ పరువును మంటగలపాలని అన్సారీ చూస్తున్నారని మండిపడుతున్నారు. ఓ రాజ్యాంగబద్ద పదవిని చేపట్టిన వ్యక్తి ఇలా మాట్లాడ్డమేంటని జాతీయవాద నెటిజన్లూ అన్సారీపై విరుచుకుపడుతున్నారు. దేశ సంస్కృతి, సమగ్రతలకు భంగం వాటిల్లేలా గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తున్న సంస్థలు నిర్వహిస్తున్న మీట్ వేదిగ్గా… ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో పాల్గొన్న అన్సారీ భారత్ లో సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
అయితే ఆయన కామెంట్లపై పెద్ద దుమారమే రేగుతోంది. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడ్డమేంటని మండిపడుతున్న నెటిజన్లు..ఇంతకన్నా అర్హుడు ఆ పదవికి దొరకలేదా అని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు. అసలు ముస్లింలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం ఇంకెక్కడుందో చెప్పాలని నిలదీస్తున్నారు.
ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఐఏఎంసీ గతంలో రోహింగ్యాల సంక్షేమం కోసం భారీగా నిధులను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ ద్వారా భారత దేశాన్ని బ్లాక్లిస్ట్లో పెట్టించాలనే లక్ష్యంతో …చేసే లాబీయింగ్ కోసం ఈ నిధులను ఖర్చు చేసినట్లు తేలింది. వీటన్నింటినీ ప్రస్తావిస్తున్న భారత పౌరులు ఆ కార్యక్రమానికి అన్సారీ ఎలా వెళ్లగలిగారని… అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారని నిలదీస్తున్నారు.
అసలు ఆయన్ని అంతటి కీలకమైన పదవిలో కూర్చుండబెట్టడం వెనక కాంగ్రెస్ ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు చాలామంది. RAW రహస్యాలను బయటపెట్టిన వాడిని ఉపరాష్ట్రపతిగా నియమిస్తే ఒక్కరైనా ఎందుకు వ్యతిరేకించలేదనీ అంటున్నారు. అన్సారీ తన బుద్ధి బయటపెట్టుకున్నాడని…ఇలాంటి వాడికి ముఖ్యమైన పదవి కట్టబెడితే దేశం పట్ల ఇలా కాక ఇంకెలా ప్రవర్తిస్తారనీ యువనెటిజన్లు అంటున్నారు. అసలు ఇలాంటి వాడికి రాజ్యాంగ బద్దమైన అతిముఖ్యమైన పదవి ఎలా కట్టబెట్టారు…ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
హమీద్ అన్సారీ, స్వరాభాస్కర్ వంటి వారు హాజరైన ఆ మీట్ నిర్వహించిన సంస్థ గురించి వివరాల్లోకి వెళ్తే..
పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధం ఉన్న జమాత్ ఎ ఇస్లామీ పార్టీ అమెరికన్ బ్రాంచే ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా ICNA . దీనికి లష్కర్ ఎ తోయిబాతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ సంస్థ పెద్ద అబ్దుల్ మాలిక్ ముజాహిద్. అతని ఆప్తమిత్రుడైన న్యూరాలజిస్ట్ షేక్ ఉబైదే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు. రోహింగ్యాలను అనుమతించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న భారత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని USCIRF పై ఒత్తిడి తేవడానికి ఈ IMAC నిధులు సేకరించి FGR అనే లాబీ సంస్థకు ఇచ్చింది. ఈ FGR సంస్థ అధినేత టెర్రీ అలెన్ కు USCIRF అద్యక్షుడు నదినే మయింజాతో దగ్గరి సంబంధాలున్నాయి.
ఇక IMAC ప్రస్తుత అధ్యక్షుడు రషీద్ అహ్మద్ గతంలో అంటే 2008-17 కాలంలో IMANA అంటే ఇస్లామిక్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ IMANA డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా ప్రస్తుతం పని చేస్తున్న జహిద్ మహమ్మద్ పాక్ మాజీ నేవల్ అఫిసర్. భారత్ మీద కుట్రలు చేయడానికి పాక్ అమెరికాలో ఎంత పకడ్బందీగా నెట్ వర్క్ తయారుచేసుకుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
అలాంటి సంస్థ గత వారం ….మోదీ సర్కారు వచ్చాక భారత్ లో ప్రజాస్వామ్య విలువలు ఎలా పడిపోతున్నాయి..మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోంది..మైనార్టీలకు ఎలా రక్షణ కరవైందో చర్చించేందుకు ఓ వర్చువల్ మీట్ నిర్వహించింది. సమయం దొరికితే చాలు భారత్ పై విషం చిమ్మే అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో పాటు భారత్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మీట్ లో పాల్గొన్నారు. భారత్ బయటఉన్న ద్వేషులతో పాటు కలిసి పోయి ఈ భారత మాజీ రాష్ట్రపతి కూడా సదస్సులో స్వదేశంపై విషం కక్కారు.
భారత్లో కొత్తగా సాంస్కృతిక జాతీయవాదం వచ్చిందని, మతపరమైన ఆధిక్యత ముసుగులో ఎన్నికల ఆధిక్యతను ప్రదర్శించే ప్రయత్నం జరుగుతోందనీ అన్నారు. దేశమీద విషం చిమ్మడం ఆయన కొత్తేం కాదు. దేశద్రోహ కార్యకలాపాలు కూడా ఆయనకు మొదటిసారి కాదు. 1990-92 మధ్య ఇరాన్ లో భారత రాయబారిగా పనిచేస్తున్న సమయంలో భారత నిఘా సంస్థ RAW అధికారుల వివరాలు బయటపెట్టారు అని అప్పటి రా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఇక హమీద్ అన్సారీ స్వయానా మేనల్లుడు యూపీలో ప్రముఖ డాన్ ముక్తార్ అన్సారీ. సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ కు కుడిభుజం లాంటివాడు. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక ముక్తార్ అన్సారీ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి.