శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రతిస్పందనను కోరింది.
న్యాయమూర్తులు అనిల్ కె నరేంద్రన్ మరియు పిజి అజిత్కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్, రేపటిలోగా తన ప్రతిస్పందనను దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ , ఈ అంశంపై వెంటనే నివేదికను దాఖలు చేయాలని శబరిమల స్పెషల్ కమిషనర్ను కూడా ఆదేశించింది.
శబరిమల ఆలయంలో ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన శబరిమల కర్మ సమితి జనరల్ కన్వీనర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. తాను దశాబ్ద కాలంగా హిందూ సంస్థలతో కలిసి పనిచేశానని, భారత సుప్రీంకోర్టులో శబరిమల కేసు పెండింగ్లో ఉన్న విచారణలో తాను కూడా భాగస్వామినని పేర్కొన్నారు.
పిటీషనర్ తరపు న్యాయవాది :
” హిందువులు భగవంతునికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు మరియు తరువాత దానిని ప్రసాదంగా తీసుకుంటారు, ఇది భగవంతుని నుండి వచ్చే పవిత్రమైన కానుక గా భావిస్తారు. దేవునికి సమర్పించేది నైవేద్యం అదే భక్తులకు తిరిగి వచ్చినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది దానిలో దేవతల ఆశీస్సులు ఉంటాయి అని భక్తులు నమ్ముతారు”
వాడుకలో ఉన్న ఆచార సంప్రదాయాలు ప్రకారం దేవతకు సమర్పించే నైవేద్యం స్వచ్ఛమైన/సాత్విక పదార్థాల నుండి తయారు చేయాలని, భగవాన్ అయ్యప్ప (శబరిమల ఆలయంలోని దేవుడు) విషయంలో ఇది మరింత అవసరం, ఎందుకంటే భక్తులు కూడా శబరిమల ఆలయ తీర్థయాత్ర చేయడానికి ముందు 41 రోజుల ఉపవాసం సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అనుసరిస్తున్నారు అని పిటిషనర్ చెప్పారు.
శబరిమల ఆలయంలో రెండు ముఖ్యమైన ప్రసాదాలు ‘అరవణ పాయసం’ మరియు ‘అప్పం ‘ శబరిమల వద్ద నైవేద్యం/ప్రసాదం తయారీకి పాడైపోయిన హలాల్ బెల్లం పొడిని ఆలయ నిర్వాహకులు ఉపయోగిస్తున్నారని వార్తా కధనాలు విని భక్తులు ఇటీవల ఆశ్చర్యపోయారని పిటిషనర్ వాదించారు.
ఇది రెండు అంశాలలో చట్టవిరుద్ధమని వాదించబడింది:
1. చెడిపోయిన పదార్థాల వినియోగం అమాయక భక్తులకు ఆరోగ్య ప్రమాదాలను సృష్టిస్తుంది;
2. మరొక మతం యొక్క మతపరమైన ఆచారాల ప్రకారం తయారు చేయబడిన హలాల్ సర్టిఫికేట్ పొందిన బెల్లం ఇక్కడ ఆలయంలో ఇక్కడ దేవుడికి నైవేద్యంగా సమర్పించడం అనేది ఆలయంలో అనాదిగా వస్తున్న మతపరమైన ఆచారాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అవుతుంది.
” ఆహార పదార్థాల తయారీలో హలాల్ను ధృవీకరించడానికి ” లాలాజలం ” అవసరమైన పదార్ధమని కొందరు ముస్లిం మత పండితులు పవిత్ర గ్రంథాలను ఉటంకిస్తూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అయితే దీనిలో ఒక వర్గం మత పెద్దలు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ హలాల్ చేయడానికి ఆహార పదార్థాలపై ఉమ్మివేయడం మరియు మత పండితుల నుండి వచ్చిన ప్రతిస్పందనల దృష్ట్యా, గృహ అవసరాలకు కూడా హలాల్ ధృవీకరించబడిన ఆహార పదార్థాలను ఉపయోగించడం పట్ల ప్రజలు చాలా అసంతృప్తి గా మరియు అసహ్యంగా ఉన్నారు.”అని విజ్ఞప్తి చేశారు.
అందువల్ల ఆలయ నిర్వహణ యొక్క చర్యలు చాలా చట్టవిరుద్ధమని మరియు హిందూ సంప్రదాయ ఆచారాలు మరియు భారత రాజ్యాంగంలోని పార్ట్ III కింద హామీ ఇవ్వబడిన మతపరమైన హక్కులను ఉల్లంఘించగలవని వాదించారు.
దీనిపై కేరళ ప్రభుత్వం ప్రసాదం తయారీ విషయంలో అన్ని పద్ధతులు పాటిస్తున్నామని కోర్టుకు తెలిపింది కానీ హలాల్ బెల్లం గురించి నేరుగా చెప్పలేదు. ఈ జవాబుపై పిటిషనర్ సంతృప్తి చెందకపోవడంతో హై కోర్ట్ అమికస్ క్యూరి ని నియమించి కేసు ఈ నెల 22కి వాయిదా వేసింది.
గమనిక:
క్రింద ఫోటోల్లో ఎడమ వైపు ఫోటోలో ఉన్న ప్యాకింగ్ ఉన్న డబ్బా మాత్రమే ఇప్పటికి నిజమైన అయ్యప్పస్వామి వారి ప్రసాదం.
రెండో వైపు బొమ్మలో అరబ్ పేరు ‘ఆల్ జహా’ తో ఉన్నది అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కాదు. అది ఒక UAE ఫుడ్ కంపెనీ అవర్ణ పాయసం పేరుమీద తయారు చేసి అమ్ముతున్న స్వీట్ మాత్రమే. దానికి స్వామి వారి ప్రసాదానికి సంబంధం లేదు. ఆ కంపెనీ కే అయ్యప్ప ప్రసాదం తయారీ కి టెండర్ ఇచ్చారు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు . షేర్ చేయకండి.
Courtesy : Chada Sastry