
భారతదేశపు కిరీటంలో మరో కలికి తురాయి
ఇజ్రాయెల్ తన హఫియా (HIAFA) పోర్ట్ను ఆదాని గ్రూప్ కి $1.2 బిలియన్లకు విక్రయించింది. 

ఈ హైఫా పోర్ట్ యొక్క ప్రాముఖ్యత :
తూర్పు మెడిటరేనియన్లోని అతిపెద్ద ఓడరేవుల్లో ఇది ఒకటి.
1. ఇజ్రాయెల్ లో ఉన్న పోర్ట్ లలో అతిపెద్దది
2. ఇండో-అరబ్-మెడిటరేనియన్ కారిడార్లో భాగం.
3. ఇజ్రాయెల్లోని చైనీస్ నిర్వహిస్తున్న మరో ఓడరేవుతో ఈ అడానీ పోర్ట్ పోటీపడుతుంది.
4. ఇది ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే మోడీ ప్రభుత్వం యొక్క చాలా కీలకమైన, వ్యూహాత్మక ఎత్తుగడ.
5. దీని వల్ల భవిష్యత్తు లో చైనా యొక్క BRI
మరియు సూయజ్ కాలువ బ్లాక్ లు భారత్ ని ఇబ్బంది పెట్టలేవు.
6. ఈ పోర్ట్ వల్ల ఒక అతి పెద్ద డిఫెన్సె/ఎకనామిక్ కారిడార్ ఏర్పడుతుంది.
7. ఇప్పటికే దీనిలో చాలా మంది భారతీయులు ఉపాధి పొందారు
8. ఈ పోర్ట్ భవిష్యత్తులో భారత్ ఎగుమతి వ్యాపారానికి కీలకంగా మారుతుంది.
చైనా యొక్క ‘స్టింగ్ ఆఫ్ పెరల్స్ ‘ విస్తరించకుండా నిరోధించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఒమాన్ లో గల దుక్మ్ పోర్ట్ కూడా కీలకంగా మారింది. చైనా విస్తారణ ఆశకు చెక్ పెట్టడానికి ఈ ఇజ్రెయేల్ పోర్ట్ కంటే ముందే 2018లో ఒమాన్ లో గల దుక్మ్ పోర్ట్ మిలిటరీ పరంగా మరియు రవాణా పరంగా ఉపయోగించడానికి భారత్ ఒమాన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇన్నాళ్ళూ చైనా తో డిఫెన్సె ఆట ఆడుతున్న భారత్ గత కొద్ది సంవత్సరాలుగా వ్యూహాత్మకంగా అఫెన్స్ ఆట ప్రారంభించింది.
ఈ వ్యూహం లో భాగమే శ్రీలంకలో అదాని గ్రూప్ శ్రీలంక కంపెనీతో కలసి జాయింట్ వెంచర్ లో భాగంగా కొలొంబో పోర్ట్ లో భాగస్వామ్యం పొందింది. శ్రీలంకలో హమ్బంతోట పోర్ట్ అప్పటికే చైనా ఆధీనంలో ఉంది..అందుకే చైనాకు చెక్ పెట్టడానికి భారత్ కొలొంబో పోర్ట్ లో వాటా చేజిక్కించుకుంది.
మోడీ ప్రభుత్వం వడివడిగా వ్యూహాత్మకంగా వేస్తున్న ఈ అడుగులపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
అలాగే ఊరికే భారతీయ వ్యాపార సంస్థలు మీద పడి ఏడవకండి. అవి ఎంత పెద్దగా ఎదిగితే మన దేశానికి ఆర్ధికంగా అంత మంచిది. అవి పలు దేశాల్లో పెట్టు బడులు పెట్టి వ్యాపారాలు చేసి మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తాయి.
….చాడా శాస్త్రి……