వారణాశి జ్ఞానవాపి మసీదులో 12 అడుగుల శివలింగం బయటపడిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసద్ మరోసారి స్పందించారు. జ్ఞానవాపి మసీదు ఉందని…ఎప్పటికీ ఉంటుందని జోస్యం చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన కొద్ది గంటలకే ఒవైసీ ట్విట్టర్లో స్పందించారు. ఓ వీడియోనూ జత చేశారు. ఇప్పటికే అయోధ్యలోని బాబ్రీ మసీదును పోగొట్టుకున్నారు. మరో మసీదును ముస్లింలు ఎప్పటికీ కోల్పోరు అనిఆయన వీడియోలో చెప్పారు. ”జ్ఞానవాపి మసీదు అనేది ఒక మసీదు. అది శాశ్వతంగా ఉంటుంది” అని దానికి క్యాప్షన్ ఇచ్చారు ఒవైసీ.
This is a textbook repeat of December 1949 in Babri Masjid. This order itself changes the religious nature of the masjid. This is a violation of 1991 Act. This was my apprehension and it has come true. Gyanvapi Masjid was & will remain a masjid till judgement day inshallah https://t.co/8r4051ktkw
— Asaduddin Owaisi (@asadowaisi) May 16, 2022