‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆందోళనగాఉందని అన్నారు. ఈ కేసును ఇప్పుడు అసాధారణ కేసుగా పరిగణిస్తున్నాం, సివిల్ కేసుగా పరిగణించడం లేదని న్యాయమూర్తి తెలిపారు.ఈ విషయమై భయం చాలా ఉంది, నా కుటుంబం ఎల్లప్పుడూ నా భద్రత గురించి ఆందోళన చెందుతోంది, అలాగే నేను వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నాను అని ఆయన అన్నారు.
“నిన్న, లక్నోలో మా అమ్మకు, నాకు సంభాషణలో కూడా నా భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. సంఘటనా స్థలానికి నన్ను వెళ్లకూడదని అడిగింది, అది నా భద్రతకు హాని కలిగించవచ్చు అని మా అమ్మ అన్నది” అని గుర్తుచేశారు.
జ్ఞానవాపి-శృంగర్ గౌరీ కాంప్లెక్స్లో వీడియో సర్వే నిర్వహించేందుకు కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను మార్చాలన్న అభ్యర్థనను కోర్టు గురువారం తిరస్కరించింది, మే 17లోగా సర్వే పనిని పూర్తి చేయాలని ఆదేశించింది.