పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఈసీకి లేఖలు రాశాయి. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్ జయంత్యుత్సవాలు బెనారస్ లో ఘనంగా జరగనున్నాయి. దాదాపు 20 లక్షలమంది వేడుకకు వెళ్లనున్నారు. దీంతో వారు ఓటు వినియోగించుకునే అవకాశం ఉండదు. దీంతో పోలింగ్ వాయిదా కోరుతూ ప్రధాన పార్టీలు ఈసీని కోరుతున్నాయి.
పోలింగ్ ను ఓ వారం పాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతకుముందు దళితవర్గం ఆయన్ని కలిసి కోరింది. పంజాబ్ లో గురు రవిదాస్ ను ఆరాధించేవాళ్లు దాదాపు 30 శాతానికి పైగా ఉన్నారు. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంత్యుత్సవాలు ముగిసిన తరువాత ఫిబ్రవరి 18 తరువాత ఎన్నికలు నిర్వహించాయని కోరుతూ…
బిజెపి నేత, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ కూడా ఈసీకి లేఖ రాశారు. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 14 ఎన్నికలు నిర్విహించేలా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.