టెర్రర్ ఫండింగ్ కేసులో పాకిస్థాన్ అనుకూల కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ప్రత్యేక NIA కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒక రోజు తర్వాత, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ ఉగ్రవాద నిందితులకు మద్దతుగా వచ్చి.. రాబోయే అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలని లోయలోని ముస్లిం ఉగ్రవాదులకు పిలుపునిచ్చింది.
ఒక వీడియో ప్రకటనలో నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను టెర్రర్ ఫండింగ్ కేసులో జీవిత ఖైదు పడిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్కు రక్షణగా నిలిచారు. మైనారిటీ ముస్లింల పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడూ పక్షపాతంతో వ్యవహరిస్తుందని ఖలిస్తానీ ఉగ్రవాది కశ్మీరీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
యాసిన్ మాలిక్ను “భారత ఆక్రమిత కశ్మీర్కు ఐకానిక్ స్వాతంత్య్ర సమరయోధుడు” అని పేర్కొన్న పన్నూ, పాక్ అనుకూల ఉగ్రవాదికి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని అన్నారు. “వేర్పాటువాదానికి నిధులు సమకూర్చడం ఉగ్రవాదం కాదు” అని.. భారత ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతోందని ఖలిస్తానీ ఉగ్రవాది ఆరోపించాడు.
https://twitter.com/JassiSingh0123/status/1529734288983396352?s=20&t=PKzXqW3iXWhOOtj5DyfNDA
కశ్మీర్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అంతర్జాతీయంగా హైలైట్ చేయడానికి యాసిన్ మాలిక్కు మద్దతుగా రావాలని.. అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలని గురుపత్వంత్ పన్నూ కశ్మీరీ ప్రజలను కోరారు.
“కశ్మీర్ స్వాతంత్య్ర సమరయోధులకు ఇది నా పిలుపు.. యాసిన్ మాలిక్కు మద్దతు ఇవ్వడానికి, అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడానికి ముందుకు రండి. ఇది కశ్మీర్ స్వతంత్ర ఉద్యమాన్ని అంతర్జాతీయంగా హైలైట్ చేస్తుంది. మీరు అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడాన్ని మేం (ఎస్ఎఫ్జే) సమర్ధిస్తాం” అని రెచ్చగొట్టే విధంగా వీడియోలో పన్నూ వ్యాఖ్యలు చేశాడు.
అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడానికి సిక్కు సమాజం, ముఖ్యంగా ఖలిస్థాన్ అనుకూల సిక్కులు మద్దతు ఇస్తారని పన్నూ అన్నాడు. ఇది కశ్మీరీ ముస్లింలకు, భారత్ కు మధ్య ఉన్న సమస్య కాబట్టి కాశ్మీరీ హిందువులు సమస్య నుంచి దూరంగా ఉండాలని కూడా అతడు హెచ్చరించాడు.
అమర్నాథ్ వార్షిక తీర్థయాత్ర జూన్ 30న ప్రారంభమవుతోంది.యాత్రకు కొన్నివారాల ముందు ఖలిస్తానీ ఉగ్రసంస్థ ఈ పిలుపునివ్వడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.