ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల పాత్ర (Role of unsung Hero’s in the freedom srtuggle)అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహా సంఘ్(ఏబిఆర్ఎస్ఎం) ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ఏబిఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీలో దాదాపు 250 మంది ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లు హాజరయ్యారు. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని బలిదానాలు చేసిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ, కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, రాణి చెన్నమ్మ, అవధ్ బిహారీ, కున్వర్ సింగ్, మదన్ లాల్ డుగ్రా, కోయిలకుంట్ల నర్సింహా రెడ్డి, వీర పాండ్య కట్టబ్రహ్మన్, వీలునాచియా, రాంజీ గోండు, తదితరుల జీవిత చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అన్నారు. ఇప్పటి నుంచి నూతనంగా ఏర్పాటు చేయబోయే పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టాలని పిలుపునిచ్చారు. ఏబిఆర్ఎస్ఎం రాష్ట్ర కన్వీనర్ ప్రో.వైవీ రామిరెడ్డి, SVU ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బీవీ మురళీధర్, అధ్యాపకులు వాణీ, రాజశేఖర్, రిపుర సుందరి సహా పలువురు పాల్గొన్నారు.