నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవించుకోవాలనీ సూచించింది. అదేసమయంలో నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది.
కాగా నుపుర్ వ్యాఖ్యలను ఇప్పటికే ఖతర్, కువైట్, ఇరాన్ తీవ్రంగా ఖండించాయి. ఆయా దేశాల్లోని దౌత్య ప్రతినిధులకు సమన్లు జారీ చేశాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయ వస్తువులను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది ఇప్పుడక్కడ. భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయాదేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే నూపుర్, జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధంలేదని ..వారిపై భారతీయ జనతాపార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందనీ స్పష్టం చేసింది విదేశీ వ్యవహారాల శాఖ. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ తీసుకున్న చర్యలను సౌదీ అరేబియా, బహ్రైన్ స్వాగతించాయి.