మరో అతిపెద్ద రాకెట్ ను పోలీసులు చేదించారు. భారత్ లోకి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను దింపాలన్న పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేస్తూ 2 వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఫిషింగ్ బోట్లో తరలిస్తుండగా నిఘావేసి పట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా ఆపరేషన్ ను నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న 40కిలోల ఆ హెరాయిన్ విలువ 2 వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని కచ్ తీరప్రాంతానికి చేర్చి… అక్కడినుంచి పంజాబ్ కు రోడ్డుమార్గం గుండా సరఫరా చేయాలని కుట్ర పన్నింది డ్రగ్ మాఫియా. అయితే ముందుగానే అందిన సమాచారంతో పక్కా పథకం ప్రకారం పట్టుకున్నారు.