కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర యోగాడేలో పాల్గొన్నారు.
నిత్య జీవితంలో యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి ఎత్తిచూపుతూ, యోగా అనేది మన ప్రాచీన సంప్రదాయం నుంచి వచ్చిన అమూల్యమైన బహుమతి అని అన్నారు. యోగా మనస్సు-శరీరం, ఆలోచన-చర్య ల ఐక్యతను కలిగి ఉంటుంది. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. తనతో తాను, ప్రపంచంతో, ప్రకృతితో ఏకత్వ భావనను ఆవిష్కరించే మార్గమని ఆయన అన్నారు.
సమృద్ధ్ భారత్ తోపాటు స్వస్థ భారత్ కూడా అవసరం.. ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలదు” అని డాక్టర్ మాండవ్య అన్నారు.
దేశవ్యాప్తంగా లక్షా 50 వేల ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు-ఏబీ-హెచ్డబ్ల్యూసీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన ప్రకటించారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.