గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది.
2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఐదోసారి అక్కడ అధికారం చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగవచ్చని అంచనా. ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం కోసం పోటీపడనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఎప్పటినుంచో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
https://twitter.com/ECISVEEP/status/1588062791193137152?s=20&t=qy8BDIXTtNBd6J8TPbKqCA