ఏ దేశానికి వెళ్లినా దేశ సంస్కృతీ వారసత్వాలను ప్రతిబింబించే కానుకలను అక్కడి ప్రముఖులకు ఇవ్వడం ప్రధానిమోదీకి అలవాటు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఈసారి అపురూప కానుకలను తీసుకెళ్లారు. భారతసంతతికి చెందిన దేశ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అయితే మోదీ ఇచ్చిన బహుమతులు చూసి ఆశ్చర్యపోయారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశిలో తయారయ్యే కళాత్మక అపురూపం గులాబీ మీనాకారి సెట్ తో పాటు…కమలా తాతగారు పీవీ గోపాలన్ కు సంబంధించిన ఫ్రేమ్ చేసిన ఓ నోటిఫికేషన్ కాపీని అందచేశారు. ఇక జపాన్ ప్రధాని యోషిడిహేకు గంధంచెక్కతో చేసిన బుద్ధుడి ప్రతిమను, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు వారణాశిలోనే తయారైన వెండి గులాబీ మీనాకారి నౌకను ఇచ్చారు.