భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. ముస్లింలు ఇతర మతాల వారికన్నా సగటున ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక జైనులు అతి తక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూరిసెర్చ్ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ‘‘రెలీజియస్ కంపోజిషన్ ఆఫ్ ఇండియా’’ పేరిట ప్యూ రిసెర్చ్ నివేదిక విడుదల చేసింది. 1992లో ముస్లిం మహిళలు సగటున 4.4 మంది సంతానాన్ని కలిగి ఉండేవారు అంటే ప్రతి 100 మంది ముస్లిం మహిళలకు 440 మంది పిల్లలు ఉండేవారు. 2015 నాటికి ఆ రేటు 2.6కు తగ్గింది. హిందూ మహిళలు 1992 నాటికి సగటున 3.3 మంది పిల్లలను కలిగి ఉండేవారు. 2015 నాటికి ఆ రేటు 2.1కి తగ్గింది. 2011 జనగణన ప్రకారం భారతదేశ జనాభా 120 కోట్లమందిలో 79.8% మంది హిందువులున్నారు. 2001 లెక్కలతో పోలిస్తే 2011 జనగణన నాటికి హిందువుల సంఖ్య కేవలం 0.7 శాతమే తగ్గింది. ముస్లిం జనాభా 2011 నాటికి 14.2 శాతానికి చేరింది.

pic courtesy : PewForum.org