ఇస్లాం వ్యాప్తి కోసం దుర్మార్గ విధానాలలో జిహాద్ ఒకటి అన్నది తెలిసిందే. ఇప్పుడు గ్రూమింగ్ జిహాద్ అనే కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. బలవంతంగా ఆడపిల్లలు ను ముస్లిం మతంలోకి మార్చేయడమే గ్రూమింగ్ జిహాద్.
ఉత్తరప్రదేశ్ లో గ్రూమింగ్ జిహాద్ బయటపడింది.
హసన్ అనే ముస్లిం యువకుడు ..హర్దోయి జిల్లా దరియాపూర్ విక్కూ గ్రామానికి చెందినవాడు . ఢిల్లీలో చదువుకుంటున్న 16ఏళ్ళ అమ్మాయిని ప్రేమ కబుర్లు చెప్పి బుట్టలో పడేసాడు. ఆ బాలికను ఢిల్లీలోనే తనతో ఒక మూడు నెలలు ఉంచుకున్నాడు. తర్వాత తన స్వగ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మసీదులో ఆమెను ఇస్లాంలోకి మతం మార్చి, లోబరుచుకొన్నాడు.
#HardoiPolice
थाना शाहाबाद पुलिस द्वारा मु0अ0सं0 597/24 धारा 27 बीएनएस व धारा 3/5(1) उ0प्र0 विधि विरुद्ध सम्परिवर्तन प्रतिषेद 2021 से संबंधित अभियुक्त को हिरासत में लेने के संबंध में क्षेत्राधिकारी नगर द्वारा दी गई बाइट।-
UPPolice pic.twitter.com/2qWSeLmaWY— Hardoi Police (@hardoipolice) November 27, 2024
ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ సంఘటన గురించి ‘కేసరియా హిందూ వాహిని’ సంస్థ హర్దోయి జిల్లా అధ్యక్షుడు పవన్ రస్తోగీకి తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దరియాపూర్ గ్రామానికి నవంబర్ 27న వెళ్ళారు. అక్కడ బాధితురాలిని కాపాడి, తమ సంరక్షణలో ఉంచారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.
తర్వాత అతన్ని పట్టుకొని ఆరెస్టు చేశారు.
దర్యాప్తులో నిందితుడు చాలా విషయాలు బయట పెట్టాడు. ఆడపిల్లలను మోసం చేసి బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒక రాకెట్ నడుస్తోందని తెలియజేశాడు. ఇందుకోసం నిధులు అందిస్తున్న ముఠా కోసం పోలీసులు వెతుకుతున్నారు.