కోవాక్సిన్ టీకాకు సంబంధించి…18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 1, ఫేజ్ 2 )కు ఆమోదం లభించింది. 2 నుంచి 18ఏళ్ల లోపు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఒ)లోని కోవిడ్-19పై సబ్జెక్ ఎక్స్ఫర్డ్ కమిటీ (ఎస్ఇసి) కి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకుంది. పరిశీలించి, చర్చించిన అనంతరం నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్, నాగ్పూర్లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్తో పాటు వివిధ ప్రాంతాల్లో పరీక్షలు చేపట్టనున్నారు.
మే 1 నుండి కోవాగ్జిన్ను నేరుగా రాష్ట్రాలకు అందిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా 18 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చి కేటాయింపుల ఆధారంగానే టీకాల పంపిణీ స్థిరంగా కొనసాగుతోందని సంస్థ సుచిత్రా ఎల్లా తెలిపారు. రాష్ట్రాలనుంచి వాక్సిన్ కు 400 చొప్పున విక్రయిస్తోంది భారత్ బయోటెక్.