ఇస్లామిజం కట్టడి కోసం అసెంబ్లీలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!
ఫ్రాన్స్ దేశం సంచలన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో గణనీయంగా పెరుగుతున్న ఇస్లామిజం కట్టడి లక్ష్యంగా ఫ్రాన్స్ దేశంల జాతీయ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇది దేశ ఐక్యతకు ముప్పంటూ బిల్లులో పేర్కొన్నారు. అయితే బిల్లులో ఏ మతం గురించి అన్నది ప్రస్తావించలేదు. కానీ.. బలవంతపు వివాహాలు, కన్వత్వ పరీక్షలపై నియంత్రణ, పిల్లలకు వేరు వేరుగా విద్యాభోదనపై ఆంక్షలు, హింసను ప్రేరేపించే ఆన్లైన్ క్షమాపణలపై కఠిన చర్యలు, మత సంస్థలపై నిఘా వంటివి ఈ బిల్లులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్రాన్స్ దేశంలో ముస్లింల జనాభా దాదాపు 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో మెజార్టీ కుటుంబాలు అల్జిరియా మూలాలకు చెందినవే ఉన్నాయి. ఇదిలావుంటే ఇస్లామిక్ మిలిటెంట్ దాడులతో ఫ్రాన్స్ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో దేశ భద్రత,ఫ్రెంచ్ గుర్తింపు వంటి సమస్యలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన తీవ్రవాదం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ దేశం నుంచి మతాన్ని వేరు చేసే ఈ బిల్లును అధికార పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు ఆమోదించారు. కాగా, గతేడాది అక్టోబర్ 16వ తేదీన మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ల ప్రదర్శించిన స్కూల్ టీచర్ శామ్యూల్ పాటీని అతికిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. కొద్ది మంది ఇస్లాంవాదుల స్వేచ్చను సవరించే ప్రయత్నంలో భాగంగా.. ప్రతి ఒక్కరి స్వేచ్చను హరించేందుకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్స్ సర్కార్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దిగువ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ప్రతిపక్షాలు ఆధిక్యమున్న సెనేట్కు చేరుతుంది. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందుతుందా.. లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.