ఆనందయ్య మందులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కంట్లో వేసే డ్రాప్స్ పై ఇంకా నివేదిక రానందున నిర్ణయం తీసుకోలేదు.
కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దాన్ని నిరాకరించినా…
ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్… మందులపై
సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంది సర్కారు. ఆయన ఇస్తున్న మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. అయితే ఆ మందువాడితే… కోవిడ్ తగ్గుతుంది అనడానికి రుజువుల్లేవనీ తేల్చారు.
కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తినివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చనీ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్పాజిటివ్ రోగులు రాకుండా… వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందనీ ప్రభుత్వం కోరింది.
మందు పంపిణీ సమయంలో కోవిడ్ ప్రోటోకాల్పాటించాలనీ కోరింది