భోథ్ మండలం కౌఠ (బి) గ్రామంలో సద్గురు శబరిమాత అఖండజ్యోతి ముగింపు కార్యక్రమంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శ్రావణమాసంలో అమ్మవారి జ్యోతి ప్రజ్వలన నిరంతరంగా మాసం పాటు వెలుగింది.గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లకి సేవలో బలరాం జాదవ్ పాల్గొన్నారు.శబరి మాత ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు నృత్యాలు చేస్తూ, భాజా,భజంత్రీలతో కౌఠ గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది.ఈ కార్యక్రమానికి వచ్చిన బలరాం జాదవ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా నిన్న కౌఠ గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.బలరాం జాదవ్ శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర గిరిజన మోర్చ అధికార ప్రతినిధి సాకటి దశరథ్, శివానంద భారతి,బాలయ్య స్వామి,మండల అధ్యక్షులు సుభాష్ సూర్య, ఎంపీటీసీ అశోక్ రెడ్డి,రమేష్ రెడ్డి,MRPS అశోక్,రవికాంత్,వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.