తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, DGP అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించారని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం జూన్ 22 నుండి ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 22 న గోల్కొండ లో బోనాలు ప్రారంభం అవుతాయని, జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని తెలిపారు. ఈ బోనాల ఉత్సవాల సందర్బంగా నగరం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని …. వహ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయాల పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ కోసం GHMC అదనపు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఊరేగింపు నిర్వహించే రహదారులు, ఆలయాలకు వెళ్ళే రహదారులలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, క్యూ లైన్ లలో ఉండే వారికి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఇతర జిల్లాల నుండి అదనపు పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని, అవసరమైన ప్రాంతాలలో CC కెమెరాలను బోనాల ఉత్సవాల కోసం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
స్వచ్చందంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్బంగా గోల్కొండ లోని శ్రీ జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లోని శ్రీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల ఆహ్లాదం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల తో బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు.
బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు – మంత్రి తలసాని
స్వచ్చందంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్బంగా గోల్కొండ లోని శ్రీ జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లోని శ్రీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల ఆహ్లాదం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల తో బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు.
Share: