గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ తరపున అభ్యర్ధులు వీరే..
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీన మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు (గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఈ నేపథ్యంలో పార్టీలు వారి వారి అభ్యర్ధులను ఖరారు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన రాంచదర్ రావు పేరును పార్టీ ఖరారు చేసింది. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది.