మణిపూర్లో క్రమంగా ప్రశాంతవాతావరణం నెలకొంటోంది. ఇంఫాల్ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను నాలుగు గంటలపాటు సడలించారు. 24 గంటల్లో ఎక్కడ కూడా ఒక్క అవాంఛనీయ ఘటనా జరగలేదు. కొన్నిరోజులుగా స్థానిక గిరిజన తెగల మధ్య నెలకొన్న ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిన సంగతి తెలిసిందే. జాతుల మధ్య నెలకొన్న విభేదాలతో మొదలైన నిరసనలు అల్లర్లుగా మారి రాష్ట్రమంతా వ్యాపించాయి. అయితే క్రమంగా అక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. మణిపూర్ అల్లర్లలో మొత్తం 54మంది చనిపోగా… వందలాదిమంది నిర్వాసితులయ్యారు.