ఢిల్లీ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోనుంది. ప్రాణవాయువు లేక తల్లడిల్లిన డిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోందని డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ అవుతున్నాయనీ ఆయన అన్నారు. మిగులు ఆక్సిజన్ను అవసరమున్న ఇతర రాష్ట్రాలకు పంపవచ్చని..కరోనా వైరస్ కేసుల్లో తగ్గుదల వచ్చిందని కేంద్రానికి సూచించినట్టు సిసోడియా తెలిపారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు అంటే 15 రోజుల క్రితం వరకూ రోజుకు 7 వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమయ్యేది. ఇప్పుడు ఆ 582 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అండగా ఉన్న కేంద్రానికి, డిల్లీ హైకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నగరంలో తాజాగా 10 వేల 4 వందల కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14 శాతానికి పడిపోయింది. డిల్లీ సర్కారు లాక్ డౌన్ అమలుచేసి కరోనాను క్రమంగా కట్టడిచేయగలుగుతోంది.