అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వీధికుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. కుక్కల సంఖ్య పెరగకుండా వందశాతం స్టెరిలైజేషన్ చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను, వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలనీ జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
https://twitter.com/noworriesbehpy/status/1627994346904764416?s=20