అస్వస్థతకు గురైన ఓ విమాన ప్రయాణీకుడికి ప్రథమచికిత్స చేశారు తెలంగాణ గవర్నర్. డా. తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ అని అందరికీ తెలుసు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తికి హఠాత్తుగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో ఒక్కసారిగా విమానంలో కలకలం. ఆ సమయంలో విమానం గాల్లో ఎగురుతోంది. అప్పటికప్పుడు లాండింగ్ కు అవకాశం లేదు. అదే సమయంలో డాక్టర్లెవరన్నా ఉన్నారా అని విమాన సిబ్బంది అనౌన్స్ చేశారు. దీంతో వెంటనే లేచి ప్రయాణికుడి వద్దకు కదిలారామె. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ధైర్యం చెప్పారు..ఆ సమయంలో ఫొటోలు తీసిన మరో ప్రయాణీకుడు ట్వీట్ చేయడంలో ఈ విషయం వెలుగుచూసింది. గవర్నర్ చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు.